
Vizianagaram District
@vzmgoap
Followers
4K
Following
3K
Media
1K
Statuses
2K
Official Account of Vizianagaram District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.
vizi
Joined January 2018
ప్రజల కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా వుంటూ వారికి ప్రభుత్వం నుండి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వాలంటీర్లకు సూచించారు.
8
1
27
గ్రామ, వార్డు వాలంటీర్లు సేవాభావంతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని దివ్యాంగుల పాఠశాల అవరణలో గ్రామ,వార్డు వాలంటీర్లకు జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైయరు.
0
1
15
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా కలక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలక్టరు డా.యం.హరి జవహర్ లాల్ ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు తేనీటి విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
0
1
13
విజయనగరం జిల్లా గజపతినగరం, నెల్లిమర్ల, గంట్యాడ, డెంకాడ, భోగాపురం, పద్మనాభం, గుర్ల, బొండపల్లి మండలాల పరిసరప్రాంతాల్లో పిడుగులుపడే అవకాశం ఉద్రుతంగా ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
0
0
10
గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భారీ స్థాయిలో భర్తీ చేసేందుకై సెప్టెంబరు 1 నుండి 8 వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ఆదేశించారు.
0
0
9
భారత దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వబౌమ అధికారాన్ని ప్రతిబింబించే విధంగా గాలిలో రెప రెపలాడుతూ ఎగురుచున్న అతి పెద్ద జాతీయ పతాకానికి కీర్తి, ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా 108 అడుగుల ఎత్తు గల జాతీయ జండాను స్తంబానికి కట్టి జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ ఎగురవేశారు.
0
0
10
అహర్నిశలు శాంతియుతంగా, నిస్వార్ధంగా పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యంను తీసుకువచ్చిన మహానుభావుల అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని, వారి ఆశయాలను, ముందుకు తీసుకు వెళ్లాలని, వారిని స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలక్టరు మరియు జిల్లా పరిషత్ ఇన్ చార్జి డా.యం.హరి జవహర్ లాల్ అన్నారు.
1
0
13
అక్రిడిటెడెట్ జర్నలిస్టుల 2019-20 హెల్త్ కార్డుల పునరుద్ధరణ, నూతనంగా కార్డులు పొందేందుకు చెల్లించాల్సిన ప్రీమియం ఆగష్ట్ 31వ తేదీ వరకు పొడిగించడమైనదని సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి.రమేష్ తెలిపారు.
0
1
10
జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ డా. ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
0
0
13
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై, వాటి సమస్యలపై ప్రతి నెలా సమీక్షిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృధ్ది శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్టులపై మంత్రి శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య క్యాంప్ కార్యాలయంలొ అధికారులతో సమీక్షించారు.
0
1
8
జిల్లాలో పేదలకు ఇళ్ల స్ధలాల మంజూరు కోసం గ్రామం యూనిట్ గా ప్రభుత్వ భూముల లభ్యతను గుర్తించాలని జిల్లా రెవిన్యూ అధికారి జె .వెంకటరావు డిప్యూటీ కలెక్టర్ లకు సూచించారు. ఆయా గ్రామాల్లో వున్నా మొత్తం భూమిని పేర్కొనకుండా అవసరమైన భూమిని మాత్రమే గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.
0
0
8
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పిర్యాధుల స్వీకరణకై కమిషన్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ అద్యక్షతన కలక్ట్రేరేట్లో నిర్వహించిన శిభిరానికి జిల్లాలోని మారు మూల గ్రామాల నుండి బాదిత బాలలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ పిర్యాధులను కౌంటర్లలో నమోదు చేసుకొనేందుకు పోటీపడ్డారు.
1
0
11
బాలల హక్కుల ఉల్లంఘనపై అందిన పిర్యాధులను తక్షణమే పరిష్కకరిస్తూ బాదిత బాలలకు వెంటనే న్యాయం చేస్తున్నామని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ తెలిపారు. అయితే జఠిల సమస్యలకు సంబందించిన పిర్యాధులను రెండు వారాల గరిష్ట కాలవ్యవధిలో పరిష్కరిస్తునామన్నారు.
0
1
14
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆద్వర్యంలో రేపు నిర్వహించబోయే పిర్యాధులు,వినతుల స్వీకరణ శిభిరాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు అందరూ సహకరించాలని కమిషన్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా కోరారు. కలక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఏర్పాట్లపై చర్చించారు.
1
1
13
జిల్లాలో రేపు నిర్వహంచబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమై జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు.
0
0
8
గ్రామ సచవాలయల పోస్టులకు సంబంధించిన పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి ముందుస్తు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచెయ్యాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.కె. ద్వివేది అన్నారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్ధులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఉండాలన్నారు.
0
1
9
వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నియంత్రించడంలో ఆయా శాఖల అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.యం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. జిల్లాలోని సాలూరు తదితర ప్రాంతాల్లో పారిశుద్ద్య పరిస్ధితులు క్షిణించినట్లు, డెంగ్యూవంటి వ్యాధులు ప్రబలుతున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు.
0
0
7
"స్పందన” కార్యక్రమంలో ఇచ్చే వినతులను ప్రత్యేక శ్రద్థతో జిల్లాయంత్రాంగం పరిష్కరించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి వినతుల పరిష్కారంపై ప్రతీవారం సమీక్షలు జరపడం ఈ వినతులను ప్రజలు మెచ్చే రీతిలో పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.
1
0
10
పట్టణంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి కె.విజయలక్ష్మి ఆరా తీశారు. బంగారమ్మకాలనీ, కర్రివీధి, గాడివీధి తదితర ప్రాంతాలను సందర్శించారు. బంగారమ్మ కాలనీలో ఇంటింటికీ వెళ్లి కుళాయి గోతులను పరిశీలించారు.l
1
0
8
గ్రామవాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎనిమిదోతేదీ వరకు నాలుగు రోజుల పాటు మండల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అభ్యర్థులకు బ్యాచ్లవారీగా ఎంపికచేసి శిక్షణ ఇస్తారు. సంబంధించిన ఏర్పాట్ల విషయమై ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశారు.
0
0
6